తెలంగాణ తిరుపతికి వచ్చేది ఏపీ బస్సులే!
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం రామాలయం తర్వాత ద్వితీయ స్థానంలో ఈ ఆలయం నిలిచింది.
ఎర్రుపాలెం, న్యూస్టుడే: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం రామాలయం తర్వాత ద్వితీయ స్థానంలో ఈ ఆలయం నిలిచింది. విభజిత ఖమ్మం జిల్లాలో అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతోంది. అంతటి మహాత్మ్యమున్న జమలాపురం శ్రీవారి సన్నిధికి చేరడానికి భక్తులకు బస్సులే కరవయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సర్వీసులే దిక్కయ్యాయి. ఖమ్మం, మధిర డిపోల నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.
ఏపీలోని మూడు డిపోల నుంచి బాగు
ఎర్రుపాలెం మీదుగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి ఇబ్రహీంపట్నం, విజయవాడ డిపోలకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన రెండు సర్వీసులు జమలాపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకటి కంచికచర్ల మీదుగా, మరొకటి జి.కొండూరు మీదుగా నడుస్తుండగా ఓ సర్వీసును రాత్రి జమలాపురంలో నిలుపుతున్నారు. తిరువూరు డిపోకు చెందిన రెండు సర్వీసులు ఎర్రుపాలెం మండలం మీనవోలు, తక్కెళ్లపాడు, సఖినవీడు, ఇనగాలి, మొలుగుమాడు, రామన్నపాలెం మీదుగా నడుస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ సర్వీసు ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, భీమవరం మీదుగా జమలాపురం వరకు రాకపోకలు సాగిస్తోంది. రాత్రిపూట భీమవరంలో నిలుపుదల చేస్తున్నారు.
పునరుద్ధరించాలని విన్నపాలు
జమలాపురం నుంచి మధిర మీదుగా భద్రాచలం వరకు ఇటీవల ఓ సర్వీసును ఏర్పాటు చేసి పది రోజులకే ప్రయాణికులు ఉండటం లేదని నిలిపేశారు. ఖమ్మం, మధిర డిపోలకు చెందిన బస్సులను భక్తుల సౌకర్యార్థం విజయవాడ, కంచికచర్ల, జి.కొండూరు, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ను కలుపుతూ జమలాపురం, గంపలగూడెం, భీమవరం సర్వీసులు ఉండేలా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మధిర డిపో నుంచి జమలాపురం మీదుగా మైలవరం నుంచి విజయవాడ వరకు సర్వీసులు నడపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎర్రుపాలెం మండలంలోని గ్రామాలను కలుపుతూ ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ వరకు ఉదయం, సాయంత్రం వరకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. శని, ఆదివారాల్లో ఖమ్మం, మధిర నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని విన్నవిస్తున్నారు.
బస్సుల్లేక శ్రీవారి భక్తుల బాధలు
-నాగులవంచ రామ్మూర్తి, ఎర్రుపాలెం
భక్తులకు బస్సులు లేకపోవటంతో అత్యధికంగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల భక్తుల సౌకర్యార్థం మధిర, ఖమ్మం డిపోల నుంచి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చెందిన సర్వీసులను నడుపుతున్నారు. ఈ అంశంపై తెలంగాణ పాలకులు స్పందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్