‘నమాజు సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి’
ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి జగన్మోహనరావు తరఫున అతని తమ్ముడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. అన్నను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. నందిగామ ఓసీ క్లబ్లో నూర్ బాషా ముస్లింలతో అరుణ్కుమార్ ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లా పేరు చెప్పి వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు.
అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ‘మీ ప్రార్థనలు, అల్లా దయ మా మీద ఉండాలి. మీరు మీ నమాజు సమయంలో మమ్మల్ని గుర్తు పెట్టుకోండి. ప్రజలకు మంచి చేస్తాం. సేవ చేయండి, ప్రేమను పంచండి.. అల్లా చెప్పిన సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటాం. తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాం.’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది.. ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావించడం నేరం. పెనమలూరులోనూ వైకాపా అభ్యర్థి జోగి రమేష్ ఇలాగే.. పాస్టర్లతో సమావేశం నిర్వహించి.. ‘ఏసు బిడ్డ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి’ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. దీనిపై ఎన్నికల అధికారులకు కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి.
ఇన్నాళ్లూ ఏం చేసినట్టు?
నూర్ బాషా ముస్లింలలో రాజకీయంగా ఎవరికీ పెద్దగా పదవులు లేవని, అత్యధిక మంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్లేనని తాను తెలుసుకున్నట్టు అరుణ్కుమార్ పేర్కొన్నారు. అందుకే.. తమను గెలిపిస్తే వాళ్లందరికీ మేలు చేస్తానని, వారి పక్షాన నిలబడి సేవ చేస్తానంటూ చెప్పడంపై.. ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో తమను పట్టించుకోకుండా వదిలేసి, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే మేలు చేస్తానంటూ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందంటూ నూర్ బాషా ముస్లింలే విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?