ఆరోగ్యశ్రీపై బకాయిల బండ
పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మూడు వేలకు పైగా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోని తీసుకొచ్చాం. వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం.. అంటూ సీఎం జగన్ ప్రసంగాల్లో ఊదరగొట్టారు.
ఎంతకూ బిల్లులివ్వని ప్రభుత్వం
సేవలందక పేదలకు ఇబ్బందులు
- జంగారెడ్డిగూడేనికి చెందిన సత్యనారాయణ (55) చాలా రోజుల నుంచి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. రెండు రోజుల కిందట ఏలూరు అశోక్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి యాజమాన్యాన్ని సంప్రదించగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాం.. కిడ్నీ శస్త్ర చికిత్స చేయాలంటే రూ.1.5 లక్షలు చెల్లించాలన్నారు. అంత స్తోమత లేక వారు వెనుదిరిగారు.
- తణుకు జాతీయ రహదారి సమీపంలోని ప్రముఖ ఆసుపత్రిలో రెండు రోజుల కిందటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు. వెంకటేశ్వర కూడలి, తణుకు బస్టాండు సమీపంలోని రెండు ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవల కోసం వస్తున్న రోగులు వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది.
- నాయుడు దుర్గమ్మ (60) అనే మహిళకు కర్ణభేరి సమస్య రావడంతో చెవికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఏలూరులో జాతీయ రహదారి సమీపంలోని ఓ ఆసుపత్రికి సోమవారం తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదని, నగదు చెల్లించి చికిత్స చేయించుకోవాలని యాజమాన్యం చెప్పింది. అంత ఆర్థిక స్తోమత లేక శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఈనాడు, ఏలూరు : పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మూడు వేలకు పైగా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోని తీసుకొచ్చాం. వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం.. అంటూ సీఎం జగన్ ప్రసంగాల్లో ఊదరగొట్టారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆరోగ్యశ్రీ నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోవడం, కొన్ని ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయడంతో పేదల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు అందక ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీకి తెరతీశారు.
ఆసుపత్రులపై ఆర్థిక భారం
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు అన్ని కలిపి 58 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. మొత్తం 12.3 లక్షల మంది వరకు లబ్ధిదారులున్నారు. జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం పడటంతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రధాన ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఆశ్రంకే రూ.12 కోట్ల బకాయిలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పొంతన లేదు.. అధికారులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆశ్రం తప్ప అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లిన వారికి మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు లేవని యాజమాన్యాలు బదులిస్తున్నాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, జంగారెడ్డిగూడెంలలోని చాలా ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు.
ప్రైవేటు దోపిడీ.. ఆరోగ్య శ్రీ సేవలు సవ్యంగా సాగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అత్యవసర సమయంలో శస్త్ర చికిత్సలు ఆపేయడంతో వచ్చిన రోగుల్లో కొందరు ఆర్థిక స్తోమత లేక వెనుదిరుగుతున్నారు. మరికొందరు అప్పులు చేసి డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం ఆరోగ్యశ్రీ అవచ్చు.. కాకపోవచ్చని ముందే చెబుతున్నారు. వస్తే ఉచితంగా వైద్యం చేస్తాం.. లేదంటే మీరే డబ్బులు చెల్లించాలని అంటున్నారు. దీంతో పేదల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఈ విషయమై ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రాజీవ్ను వివరణ కోరగా అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్