నిబంధనలపై అవగాహన.. ప్రచారం కల్పిస్తే ఆదరణ
నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది.
ఆర్టీఏ ఆవరణలో పిల్లల ట్రాఫిక్ పార్కు
న్యూస్టుడే, తెలంగాణచౌక్(కరీంనగర్)
ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని ట్రాఫిక్ అవగాహన పార్కు
నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది. 2019లో తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కు ఏర్పాటు చేశారు. మొదట్లో విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చినా, ఆ తర్వాత ఆదరణ కొరవడింది. మళ్లీ ప్రచారం కల్పిస్తే పిల్లలు వచ్చి నిబంధనలపై అవగాహన పెంచుకునే అవకాశముంది.
సందేహాల నివృత్తి..
ట్రాఫిక్ అవగాహన పార్కులో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.30 చొప్పున, సర్కారు బడి పిల్లలకు ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. పార్కులో ప్రవేశానికి ముందు విద్యార్థుల సంఖ్యను బట్టి పిల్లలను గ్రూపులుగా విభజించి ఆడిటోరియంలో ఉదయం, మధ్యాహ్నం ట్రాఫిక్కు సంబంధించిన తరగతులు చెబుతారు. గంట సేపు ప్రొజెక్టర్పై ఫొటో, వీడియోల ద్వారా తరగతులు చెబుతూ సందేహాలుంటే వెంటనే నివృత్తి చేస్తారు. ట్రాఫిక్పై పూర్తి అవగాహన వచ్చేలా కృషి చేస్తారు.
తరగతుల ఆధారంగా..
తరగతులు విన్న విద్యార్థులకు సైకిల్, శిరస్త్రాణం అందించి ట్రాఫిక్ అవగాహనకు పార్కులోకి పంపుతారు. విన్న పాఠాల ఆధారంగా విద్యార్థులు పార్కులో సైకిళ్లపై చక్కర్లు కొడుతూ తిరుగుతారు. మధ్యమధ్యలో స్టాప్, సిగ్నల్, క్రాసింగ్, మూవ్, హారన్, డోన్ట్ హారన్, రైల్వేట్రాక్, పాఠశాల, ఆసుపత్రి జోన్, మార్కెట్ వంటి చిహ్నాలు కనిపిస్తాయి. తరగతి గదిలో నేర్చుకున్న వివరాలను నివృత్తి చేసుకుంటూ విద్యార్థులు పార్కును చుట్టిరావాల్సి ఉంటుంది.
అనుభవాల పాఠాలు..
విద్యార్థుల్లో కొందరిని ట్రాఫిక్ పోలీసులుగా నియమిస్తారు. పార్కులో మిగిలిన పిల్లలు సైక్లింగ్ చేసే సమయంలో వారు నియమాలను పాటిస్తున్నారా? లేదా? అని వీరు పరిశీలిస్తారు. నియమాలను ఉల్లంఘించిన విద్యార్థులకు జరిమానా విధింపు, ట్రాఫిక్ ఆంక్షలు చోదకులకు వివరించేలా శిక్షణ ఇప్పిస్తారు. సైకిల్ తొక్కడం రాని విద్యార్థులు ఫుట్బోర్డుపై నడుచుకుంటూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవచ్చు. అనంతరం విద్యార్థుల అనుభవాలు, నేర్చుకున్న విషయాలను తోటి విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చిస్తారు. ఇదంతా అధికారులు దగ్గరుండి పరిశీలిస్తారు.
ఇప్పటికీ 9451 మంది రాక
పార్కు ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 9451 మంది విద్యార్థులు పార్కును సందర్శించి ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకున్నారు. కరోనా తర్వాత పార్కుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గింది. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ అవగాహన పార్కుపై ప్రచారం చేసినట్టయితే విద్యార్థులు వచ్చే అవకాశముంది.
దృష్టి సారిస్తాం
ట్రాఫిక్ అవగాహన పార్కుకు విద్యార్థులు వచ్చేలా చూస్తాం. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ విషయంపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల దృష్టికి తీసుకెళ్తాం. విద్యార్థి దశ నుంచే రహదారి నిబంధనలు తెలుసుకోవడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
పెద్దింటి పురుషోత్తం, డీటీసీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్