Hyderabad: పీవీ ఘాట్‌ వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌ నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Updated : 23 Dec 2023 14:01 IST

హైదరాబాద్‌: భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. దేశాన్నీ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని చెప్పారు. పీవీ నరసింహారావు (PV Narasimha Rao) వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద  పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan), సీఎం రేవంత్‌ (Revanth Reddy) శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ అని కొనియాడారు. పీవీ కీర్తిని పెంచాలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్‌ అన్నారు.

భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ: భట్టి

దిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే సొంతమని చెప్పారు. విద్యావ్యవస్థ సహా అనేక సామాజిక మార్పులకు కృషి చేశారని, భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ అని కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని