Hyderabad: పీవీ ఘాట్ వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
హైదరాబాద్: భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. దేశాన్నీ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని చెప్పారు. పీవీ నరసింహారావు (PV Narasimha Rao) వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan), సీఎం రేవంత్ (Revanth Reddy) శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ అని కొనియాడారు. పీవీ కీర్తిని పెంచాలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ అన్నారు.
భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ: భట్టి
దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే సొంతమని చెప్పారు. విద్యావ్యవస్థ సహా అనేక సామాజిక మార్పులకు కృషి చేశారని, భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ అని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్