TS Governor: మన ప్రజలు పడిన వేదనను అర్థం చేసుకోవడం అవసరం: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం చేసిన పోరాటం మన దేశ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం చేసిన పోరాటం మన దేశ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆరోజు.. ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. దేశమంతా 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం పొందగా, తెలంగాణ, మరఠ్వాడా, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలతో కూడిన పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం గాలిని పీల్చిందన్నారు.
ప్రస్తుత తరం.. మన ప్రజలు పడిన వేదనను అర్థం చేసుకోవడం అవసరమన్నారు. హైదరాబాద్ విమోచన ఉద్యమం సమయంలో ఈ రోజును స్మరించుకోవడం వారి అపారమైన త్యాగాలకు నివాళిగా ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకుందామన్నారు. ఇది మనం ఐక్యంగా నిలబడితే సాధించగల అసాధారణ విజయాలను గుర్తు చేస్తుందన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం తమ జీవితాలను అంకితం చేసిన వీర విముక్తి యోధులను సమష్టిగా స్మరించుకుందాం అని గవర్నర్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం