మరాఠీ విద్యార్థులు.. జపనీస్ నేర్చుకుంటున్నారు
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన చేయాలన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లభాషలో బోధిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రజలు
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన చేయాలన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లభాషలో బోధిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భాషపై ఇన్ని వివాదాలు కొనసాగుతుండగా.. మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏకంగా ఓ విదేశీ భాషను నేర్చుకుంటున్నారు.
ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక మేరకు విదేశీ భాషను నేర్పిస్తుంటారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సదుపాయం ఉండదు. అయితే మహారాష్ట్రలోని ఔరంగబాద్కు 25కి.మీ దూరంలో ఉన్న గడివాట్ అనే గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు అక్కడి పాఠశాల యాజమాన్యం జపనీస్ నేర్పిస్తోంది. ఆ పాఠశాలలో 4-8 తరగతి విద్యార్థులను ఏదైనా విదేశీ భాష ఎంచుకోమని అడిగితే చాలా మంది జపనీస్ను ఎంచుకున్నారట. దీంతో జపనీస్ భాషా పండితులతో ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యార్థులకు ఈ భాష నేర్పిస్తున్నారు. అక్కడి టీచర్లు కూడా జపనీస్ నేర్చుకోవడం విశేషం. విద్యార్థులకు వృత్తికి తగిన విద్యను అందించాలన్న లక్ష్యంతో గతేడాది ఈ విదేశీ భాష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్థానిక జిల్లా విద్యాధికారి తెలిపారు. విద్యార్థులు జపనీస్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఔరంగబాద్లో ఉన్న అజంతా.. ఎల్లోరా గుహలను చూడటానికి ఏటా చాలా మంది జపనీయులు వస్తుంటారట. వారికి వారి మాతృభాషలో ఈ చారిత్రక నిర్మాణాల గురించి వివరించేలా గైడ్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతేకాదు, ఇక్కడి విద్యార్థులు టెక్నాలజీ, రోబోటిక్స్పై ఆసక్తి చూపుతున్నారు. జపాన్లో ఈ రంగాలకు అధిక ప్రాధాన్యముంది. దీంతో జపనీస్ భాష నేర్చుకొని అక్కడికి వెళ్లి ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికే జపనీస్ నేర్చుకోవడంలో తొలి దశ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆ భాషలో మాట్లాడగలుగుతున్నారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారట. ఈ పాఠశాల విద్యార్థులు జపనీస్ నేర్చుకోవడం గురించి తెలిసి జపాన్లో ఉంటున్న ఓ భారతీయ ప్రొఫెసర్ ఈ పాఠశాలకు మరాఠీ-జపనీస్ డిక్షనరీలను పంపించారట. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు ఆదర్శమనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల