Group 2 Prelims: ఏపీలో గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-2 ఉద్యోగ నియామకాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం ఉదయం 10.30కు ప్రారంభమైంది.

Published : 25 Feb 2024 10:32 IST

అమరావతి: ఏపీలో గ్రూపు-2 ఉద్యోగ నియామకాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం ఉదయం 10.30కు ప్రారంభమైంది. ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. 1,327 కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 24,142 మంది ఇన్విజిలేటర్లు, 850 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాల వారీగా 24 మంది ఐఏఎస్‌లకు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కేంద్రాల వద్ద బందోబస్తుకు 3,971 మంది పోలీసులను, ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాల తరలింపు కోసం అదనంగా మరో 900 మంది పోలీసులను నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని