అంతరిక్షానికి పంపిన సమోసా.. ఫ్రాన్స్లో దిగింది!
బ్రిటన్లో ఉండే ఓ భారతీయ యువకుడు ఇటీవల సమోసాలను అంతరిక్షానికి పంపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్తుందనుకుంటే.. ఫ్రాన్స్లో ల్యాండ్ అయి వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్లో ఉండే ఓ భారతీయ యువకుడు ఇటీవల సమోసాలను అంతరిక్షానికి పంపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్తుందనుకుంటే.. ఫ్రాన్స్లో ల్యాండ్ అయి వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
నీరజ్ గాధర్.. బ్రిటన్లో ఛాయ్ వాలా ఈటరీ పేరుతో రెస్టారెంట్ నడుపుతున్నాడు. గతంలో ఒకసారి నీరజ్ తన స్నేహితులతో మాట్లాడుతూ.. తన రెస్టారెంట్లో తయారు చేసిన సమోసాలను అంతరిక్షంలోకి పంపిస్తానని సరదాగా చెప్పాడట. అందరూ అప్పుడు నవ్వి ఊరుకున్నారు. అయితే, ఇటీవల కరోనా కారణంగా కస్టమర్లు రాకపోవడంతో రెస్టారెంట్ ఖాళీగా ఉంటోంది. ఇదే అదునుగా నీరజ్ తను చెప్పిన సరదా మాట నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెస్టారెంట్లో తయారు చేసిన సమోసాలను అంతరిక్షంలోకి పంపాలని సన్నాహాలు చేసుకున్నాడు.
స్థానికంగా అనువైన ప్రాంతాన్ని ఎంచుకున్న నీరజ్ తన స్నేహితులతో కలిసి హీలియం గాలి బుడగలో సమోసాలు, గో ప్రో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ పెట్టి గాల్లోకి వదిలేశాడు. తొలి రెండు ప్రయత్నాల్లో గాలి బుడగ నింగిలోకి వెళ్లలేదు. కానీ, మూడోసారి వారు అనుకున్నట్లే గాలిబుడగ ఆకాశంలో తేలుతూ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ బుడగ ప్రయాణాన్ని నీరజ్ జీపీఎస్, కెమెరా ఆధారంగా పరిశీలించాడు. అయితే, కొంత సమయానికి జీపీఎస్ ట్రాకర్ పనిచేయడం మానేసింది. దీంతో తన ప్రయత్నం విఫలమైందని నిరాశపడ్డాడు. కానీ, మరుసటి రోజు సమోసాలు మోసుకెళ్తున్న గాలిబుడగలోని జీపీఎస్ ట్రాకర్ పనిచేయడంతో అది ఫ్రాన్స్లో పడిపోయిందని తేలింది.
దీంతో నీరజ్ సోషల్మీడియా ద్వారా ఫ్రాన్స్లో ఉండే నెటిజన్లకు గాలిబుడగను కనిపెట్టమని విజ్ఞప్తి చేశాడు. యాక్సెల్ మాథన్ అనే వ్యక్తి నీరజ్ విజ్ఞప్తిని మన్నించి గాలిబుడగ పడిన ప్రాంతాన్ని కనిపెట్టాడు. ఫ్రాన్స్కు ఉత్తరంవైపు ఉన్న పకార్డీ ప్రాంతంలో పగిలిపోయిన గాలిబుడగ చెట్లపై పడి ఉండటాన్ని యాక్సెల్ గుర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక మీడియాకు, నీరజ్కు తెలియజేశాడు. గాలిబుడగ ప్రయోగాన్ని నీరజ్ చిత్రీకరించి తన రెస్టారెంట్ యూట్యూబ్ ఛానెల్లో పెట్టడంతో ఈ అంశం వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు