Pinnelli: జూన్ 6వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
జూన్ 6వ తేదీ వరకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: జూన్ 6వ తేదీ వరకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పిటిషనర్లు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పోలింగ్ రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పల్నాడు ఎస్పీ నేతృత్వంలో 8 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో గురువారం పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్ స్టార్- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. -
ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత విధానసభ సభ్యులు సాంకేతికంగా ఒకే పదవి అంటిపెట్టుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో