Tirumala: ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను

వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల(Tirumala)కు భక్తులు పోటెత్తారు. 

Published : 17 May 2024 19:24 IST

తిరుమల: తిరుమల(Tirumala)కు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది. అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయి.. ఔటర్‌ రింగురోడ్డులో 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు. 

తిరుమలలో జోరు వాన..

తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని