Rushikonda: రుషికొండ తవ్వకాలపై పిల్‌.. డిసెంబర్‌ 27కి వాయిదా

విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Updated : 01 Dec 2023 14:30 IST

అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్‌ మొదటివారంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పంపిన బృందం పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్కడి పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 27కి హైకోర్టు వాయిదా వేసింది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని