ఎండాకాలంలో దాహం తీర్చే పండ్లు ఇవీ..!
ఎండాకాలం వచ్చేసింది.. భగభగ మండే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ తీవ్రమైన ఎండలో బయటకు వెళ్తే శరీరం తొందరగా నిర్జలీకరణమైపోతుంది. దీంతో శరీరంలో నీటిస్థాయితోపాటు పోషకాలూ తగ్గిపోతయి. అయితే, శరీరం కోల్పోయిన
ఇంటర్నెట్ డెస్క్: ఎండా కాలం వచ్చేసింది.. భగభగ మండే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ తీవ్రమైన ఎండలో బయటకు వెళ్తే శరీరం తొందరగా నిర్జలీకరణమైపోతుంది. దీంతో శరీరంలో నీటి స్థాయితో పాటు పోషకాలూ తగ్గిపోతాయి. అయితే, శరీరం కోల్పోయిన నీటి నిల్వలను, పోషకాలను కొన్ని రకాల పండ్లను తినడం వల్ల తిరిగి పొందొచ్చు. ఈ పండ్లు శరీరంలో నీటిస్థాయిని పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. మరి ఆ పండ్లేవో తెలుసుకుందామా..!
కీరా దోస
కీరా దోసలో 95శాతం నీరు ఉంటుంది. ఈ ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చేలా పండ్లు తినాలనుకుంటే ఈ దోసకాయను తినొచ్చు. ఈ కీరా దోస శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫిసెటిన్ అనే రసాయన మూలకం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ ముక్కలను కళ్ల వద్ద పెట్టుకుంటే కళ్ల కింద నల్లటి చారలు రాకుండా ఉంటాయి. చర్మసౌందర్యం కోసం ఫేసియల్ మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. ప్రతి రోజు కీరా తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
పుచ్చకాయ
ఈ ఎండా కాలంలోనే ఎక్కువగా దొరికే పుచ్చకాయల్లో 92శాతం నీరు ఉంటుంది. వీటిని తింటే దాహార్తి ఇట్టే తీరిపోతుంది. నిర్జలీకరణ సమస్యను నివారించవచ్చు. పుచ్చకాయ రక్తపోటును నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. ఇందులోని విటమిన్లు ఏ, సీ, బీ6.. జుట్టు, చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఉండే పీచుపదార్థాలు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదపడతాయి.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలో 91శాతం నీరు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీటిని అందించొచ్చు. ఆకట్టుకునే రంగులో.. చూడగానే నోరూరించే ఈ పండల్లో పీచు పదార్థాలతో పాటు ఏ, సీ, బీ6, బీ9, ఈ, కె విటమిన్లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ వంటి పోషకాలూ ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో కొవ్వును తగ్గిస్తాయి. ఇందులోని ఫెనోలిక్ రసాయన మూలకాలు క్యాన్సర్ను తగ్గించడంలో దోహదపడతాయి.
కర్భూజ
కర్భూజ పండ్లలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కంటిచూపు సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్ కే, ఈలు శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
బత్తాయి
సీ విటమిన్ మెండుగా ఉండే బత్తాయి పండ్లు ఎండాకాలంలో దాహార్తితోపాటు ఆకలినీ తీరుస్తాయి. ఈ పండ్లలో 88శాతం నీరు ఉంటుంది. ఇందులోని సీ విటమిన్.. రోగ నిరోధకశక్తిని పెంచడతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పోటాషియం గుండె పనితీరు మెరుగయ్యేలా చేస్తుంది. బత్తాయిలో ఉండే పీచుపదార్థాలు శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. యాంటీ-యాక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
అనాస(పైనాపిల్)
అనాస పండ్లలో నీటి మోతాదు 87శాతం ఉంటుంది. ఈ పండు దాహార్తిని తీర్చడంతోపాటు శరీరానికి అనేక లాభాలు చేకూర్చుతుంది. ఇందులో ఉండే సీ విటమిన్ యాంటీ యాక్సిటెండ్లుగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. దెబ్బతిన్న కణజాలాలను నయం చేస్తాయి. అనాసలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇందులోని బీ విటమిన్ ఒత్తిడిని తగ్గించి.. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. బీటాకెరోటిన్, ఇతర విటమిన్లు కంటిచూపు మందగించకుండా కాపాడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్