Andhra news: ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్‌: డీజీపీ

ఎన్నికల ముందు, తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్‌ తెరిచినట్టు ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 21 May 2024 21:12 IST

అమరావతి: ఎన్నికల ముందు, తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్‌ తెరిచినట్టు ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్‌, మారో ఇద్దరని బహిష్కరణ చేసేందుకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1,522 మంది నిందితులను గుర్తించినట్టు తెలిపారు.  ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2,790 మందిని గుర్తించారు. అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించారు. నిందితుల్లో కొందరిని అరెస్టు చేశామని, మరి కొందరికి 41ఏ నోటీసులిచ్చామని డీజీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని