Mallareddy: అప్పుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు.. ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాకిచ్చిన అధికారులు

Chamakura Malla Reddy: గతంలో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా ఎమ్మెల్యే మల్లారెడ్డి వేసిన అనధికార రోడ్డును అధికారులు తవ్వేశారు.

Updated : 02 Mar 2024 18:41 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి, మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Chamakura Malla Reddy) అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్-మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్‌లో అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  దీంతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని