Buggana: మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 28 Jun 2023 15:29 IST

బేతంచర్ల: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో సుమారు 70 మందికి గాయాలయ్యాయి. బుగ్గనకు ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని బేతంచర్ల శేషారెడ్డి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బుగ్గన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు