holiday vacation: విహారయాత్ర ఎన్ని రోజులుంటే బాగుంటుంది?
కరోనా.. లాక్డౌన్ కారణంగా గత కొన్నాళ్లుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు.. దాంతో గృహిణిలకు ఇంట్లో పనులు మరింత పెరిగాయి. వీటన్నింటికీ విరామం ఇచ్చి హాయిగా కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది
ఇంటర్నెట్ డెస్క్: కరోనా లాక్డౌన్ కారణంగా గత కొన్నాళ్లుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు.. దాంతో గృహిణులకు ఇంట్లో పనులు మరింత పెరిగాయి. వీటన్నింటికీ విరామం ఇచ్చి హాయిగా కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. అందుకే, లాక్డౌన్ ఆంక్షలు లేని ప్రాంతాలకు రెక్కలు కట్టుకుకొని వాలిపోతున్నారు. మరికొందరు వారికి నచ్చిన ప్రాంతంలో ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. జీవితంలో ఒత్తిళ్లను మర్చిపోవడానికి విహారయాత్ర నిజంగానే సంజీవనిలా పనిచేస్తుంది. అయితే, ఎన్ని రోజులు వెళ్లాలి? సెలవులు ఎంతకాలం తీసుకుంటే.. విహారయాత్ర ఆహ్లాదంగా ఉంటుందనే విషయంపై గతంలో ఓ యూనివర్సిటీ పరిశోధన చేసింది. అందులో తేలిందేమంటే..
విహారయాత్రకు ఎనిమిది రోజులు సరిపోతాయని ఫిన్లాండ్లోని టాంపెరె యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఎనిమిది రోజుల ట్రిప్లో మనిషికి కావాల్సినంత ప్రశాంతత, విశ్రాంతి లభిస్తాయని పేర్కొన్నారు. హాలీడే ట్రిప్ మొదటి రోజు నుంచే ప్రశాంత భావం, సానుకూల ప్రయోజనాలు ప్రారంభమవుతాయట. అవి ఎనిమిది రోజులపాటు ఉంటాయని, ఆ తర్వాత తగ్గుతూ.. ఉద్యోగం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల ఆలోచనలు మొదలవుతాయని చెప్పారు. పదకొండో రోజుకు వచ్చేసరికి అవి మరింత పెరుగుతాయని వెల్లడించారు.
విచారకరమైన అంశమేంటంటే.. ఎన్ని రోజులు విహారయాత్రకు వెళ్లినా.. తిరిగొచ్చాక ఆ ఆహ్లాదభరిత క్షణాలను మీరు త్వరగా మరచిపోతారని.. మీ మానసిక స్థితి, రోజువారీ పనులపై అదెలాంటి ప్రభావం చూపదని పరిశోధకులు స్పష్టం చేశారు. కాకపోతే ఈ విహారయాత్రల వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుందన్నారు. కాబట్టి.. ఎక్కువ రోజులు విహారయాత్రకు వెళ్తే మంచి అనుభూతి మిగిలిపోతుందని భావించి.. రెండుమూడేళ్లకు ఒకసారి ఎక్కువ రోజులు సెలవులు పెట్టి విహారయాత్రకు వెళ్లడం కన్నా.. ఏటా 7 నుంచి 11 రోజులు విహారయాత్ర చేయడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!