Hyderabad Metro: ప్రైవేటు ఆస్తుల సేకరణ సాధ్యమైనంత వరకు తగ్గించండి: ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ పనులను ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.
హైదరాబాద్: ప్రైవేటు ఆస్తుల సేకరణను సాధ్యమైనంతవరకు తగ్గించే విధంగా ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ ఖరారు చేయాలని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ (Airport Metro alignment) ను ఇంజినీర్లతో కలిసి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. నార్సింగి నుంచి రాజేంద్రనగర్ గుట్ట వరకు 10 కి.మీ నడిచి అలైన్మెంట్ పరిశీలించారు. స్టేషన్లకు సులువుగా చేరుకోవడం కోసం ఓఆర్ఆర్ అండర్ పాస్లను ఉపయోగించేందుకు వీలుగా స్టేషన్లను నిర్ణయించాలని ఎండీ వెల్లడించారు. భవిష్యత్తులో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించిన ప్రదేశాల్లో మెట్రో వయాడక్ట్ను ప్లాన్ చేయాలన్నారు. స్కైవాక్లు, ఇతర పాదచారుల సౌకర్యాలు స్టేషన్ ప్లానింగ్లో అంతర్భాగంగా ఉండాలని, మెట్రో పిల్లర్లు నానక్రామ్ గూడ జంక్షన్ నుంచి అప్పా వరకు విస్తరించిన సర్వీసు రోడ్డు సెంట్రల్ మీడియన్లో ఉండాలన్నారు. స్టేషన్ల యాక్సెస్ పాయింట్లు కొత్త సైకిల్ ట్రాక్కు అనుగుణంగా ఉండాలని, పర్యావరణహితంగా స్టేషన్లను చేరుకోవడానికి ఈ కొత్త సైకిల్ ట్రాక్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు