Hyderabad Metro: ప్రైవేటు ఆస్తుల సేకరణ సాధ్యమైనంత వరకు తగ్గించండి: ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ పనులను ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.
హైదరాబాద్: ప్రైవేటు ఆస్తుల సేకరణను సాధ్యమైనంతవరకు తగ్గించే విధంగా ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ ఖరారు చేయాలని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ (Airport Metro alignment) ను ఇంజినీర్లతో కలిసి ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. నార్సింగి నుంచి రాజేంద్రనగర్ గుట్ట వరకు 10 కి.మీ నడిచి అలైన్మెంట్ పరిశీలించారు. స్టేషన్లకు సులువుగా చేరుకోవడం కోసం ఓఆర్ఆర్ అండర్ పాస్లను ఉపయోగించేందుకు వీలుగా స్టేషన్లను నిర్ణయించాలని ఎండీ వెల్లడించారు. భవిష్యత్తులో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించిన ప్రదేశాల్లో మెట్రో వయాడక్ట్ను ప్లాన్ చేయాలన్నారు. స్కైవాక్లు, ఇతర పాదచారుల సౌకర్యాలు స్టేషన్ ప్లానింగ్లో అంతర్భాగంగా ఉండాలని, మెట్రో పిల్లర్లు నానక్రామ్ గూడ జంక్షన్ నుంచి అప్పా వరకు విస్తరించిన సర్వీసు రోడ్డు సెంట్రల్ మీడియన్లో ఉండాలన్నారు. స్టేషన్ల యాక్సెస్ పాయింట్లు కొత్త సైకిల్ ట్రాక్కు అనుగుణంగా ఉండాలని, పర్యావరణహితంగా స్టేషన్లను చేరుకోవడానికి ఈ కొత్త సైకిల్ ట్రాక్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...