Flavour Graveyard : ఐస్క్రీమ్ ఫ్లేవర్లకు సమాధులు.. ఎందుకో తెలుసా?
మనుషులు చనిపోతే వారికి సమాధులు నిర్మిస్తాం. పెంపుడు జంతువులు మృతి చెందినా.. వాటి జ్ఞాపకార్థం కొందరు సమాధులు నిర్మించడం గురించి విన్నాం. కానీ, యూఎస్లోని ఓ ఐస్క్రీమ్ పార్లర్.. ఐస్క్రీమ్ ఫ్లేవర్లకు సమాధులు ఏర్పాటు చేస్తోంది. ఫ్లేవర్లకు
ఇంటర్నెట్ డెస్క్: మనుషులు చనిపోతే వారికి సమాధులు నిర్మిస్తాం. పెంపుడు జంతువులు మృతి చెందినా.. వాటి జ్ఞాపకార్థం కొందరు సమాధులు నిర్మించడం గురించి విన్నాం. కానీ, యూఎస్లోని ఓ ఐస్క్రీమ్ పార్లర్.. ఐస్క్రీమ్ ఫ్లేవర్లకు సమాధులు ఏర్పాటు చేస్తోంది. ఫ్లేవర్లకు సమాధులేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి..
వెర్మంట్లోని వాటర్బర్నీ అనే గ్రామంలో బెన్ అండ్ జెర్రీ అనే ఫేమస్ ఐస్క్రీమ్ పార్లర్ ఉంది. 1978లో దీన్ని ప్రారంభించారు. అనేక రకాల ఫ్లేవర్లను సృష్టించి విక్రయించడం ఈ ఐస్క్రీమ్ పార్లర్ ప్రత్యేకత. అందుకే నగరాల నుంచి ఎంతో మంది కేవలం ఈ ఐస్క్రీమ్ తినడానికి ఇక్కడికి వచ్చేవారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాఖలు కూడా ఏర్పాటయ్యాయి.. అయితే, ప్రతి దానికి ఒక ప్రారంభం, ముగింపు ఉన్నట్లే.. వీరు తయారు చేసే ఐస్క్రీమ్కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్లేవర్లను పరిచయం చేసే ఈ సంస్థ.. వాటిని కస్టమర్లు ఇష్టపడకపోతే తయారు చేయడం మానేస్తుంటుంది. అలా తయారు చేయడం మానేసిన ఐస్క్రీమ్ ఫ్లేవర్లకు బెన్ అండ్ జెర్రీ సంస్థ సమాధులు ఏర్పాటు చేస్తోంది.
కస్టమర్లకు నచ్చని ఐస్క్రీమ్ ఫ్లేవర్ను భూమిలో పాతిపెట్టి మనుషులకు అంత్యక్రియలు జరిపించినట్లుగానే జరిపిస్తోందీ సంస్థ. ఆ తర్వాత ఆ ఫ్లేవర్ ఫొటో.. దాని ప్రత్యేకత, ఏ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న వివరాలను శిలాఫలకంపై చెక్కి.. సమాధి నిర్మిస్తుంటుంది. అలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఐస్క్రీమ్ ఫ్లేవర్లకు ఈ ఐస్క్రీమ్ పార్లర్ సమాధులు కట్టించింది. ఆ సమాధుల ఫొటోలను సంస్థ తమ అధికారిక వెబ్సైట్లోని ‘ఫ్లేవర్ గ్రేవ్యార్డ్’ విభాగంలో ఉంచింది. సమాధులుగా మారిన ఐస్క్రీమ్ ఫ్లేవర్లలో దేన్నైనా ఎక్కువ మంది కస్టమర్లు కోరితే.. దాన్ని తిరిగి తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సంస్థ చెబుతోంది. భలే వింతయిన ఆలోచన కదా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల