Andhra news: సెలవు ప్రతిపాదన వెనక్కి తీసుకున్న సీఐడీ చీఫ్‌ సంజయ్‌

ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Published : 06 Jun 2024 00:03 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్‌ చేయకూడదని నిర్ణయించింది. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు రిలీవ్‌ చేయాలని ఇప్పటికే పలువురు అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యుటేషన్‌పై వచ్చిన వారిపై గతంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు వెళ్లేందుకు కొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

  • సెలవుపై వెళ్తానంటూ తితిదే ఈవో ధర్మారెడ్డి చేసిన దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది.
  • సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.
  • మాతృ సంస్థకు వెళ్తానని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ దరఖాస్తు.
  • ఏపీ నుంచి రిలీవ్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్న గనులశాఖ ఎండీ  వెంకట్‌రెడ్డి.
  • తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలన్న సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి.
  • మాతృశాఖకు పంపాలని కోరిన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి.
  • ఏపీ నుంచి రిలీవ్‌ చేయాలని కోరిన ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్‌ రాజేశ్వర్‌రెడ్డి.
  • తెలంగాణకు వెళ్తానన్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని