Railways: 8 రైళ్లకు అదనపు స్టాపులు.. కాకినాడకు ప్రత్యేక రైళ్లు
South central railways: ప్రయాణికుల సౌకర్యార్థం ఎనిమిది రైళ్లకు అదనపు స్టాప్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలివే..
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు స్టాప్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం సర్వీసులందిస్తున్న స్టేషన్లకు తోడు అదనంగా ఒక స్టేషన్లో ఆయా రైళ్లను నిలిపేలా చర్యలు చేపట్టింది. అయితే, ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై అదనంగా కేటాయించిన స్టేషన్లలోనూ ఆగుతాయని పేర్కొంది. అలాగే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఆగస్టు 23 నుంచి ఎస్ఎస్ఎస్ హుబ్బళ్లి- హైదరాబాద్-ఎస్ఎస్ఎస్ హుబ్బళ్లి మధ్య సర్వీసులందించే రైళ్లు (17319, 17320) హోత్గి స్టేషన్లో ఆగనున్నాయి. అలాగే, విశాఖ నుంచి ముంబయి ఎల్టీటీ- విశాఖ(18519, 18520) మధ్య; కాకినాడ-ముంబయి-కాకినాడ(17221, 17222) మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైళ్లు కల్యాణ్ స్టేషన్లోనూ ఇకపై ఆగుతాయి. వీటితో పాటు ఆగస్టు 24 నుంచి విశాఖ - శిర్డీ- విశాఖ మధ్య వారానికి ఒకరోజు సర్వీసులందించే రైళ్లను (18503, 18504) కోపర్గాన్లో స్టేషన్లోనూ కాసేపు ఆపుతారు.
కాకినాడకు ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ టౌన్ -లింగంపల్లి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ నుంచి రాత్రి 20.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు లింగంపల్లి చేరుకోనుంది. అలాగే, మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.25గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంలకు కాకినాడకు చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్తో పాటు స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్ల సేవల్ని పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలివే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన