Rajamahendravaram: అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభం

రాజమహేంద్రవరంలోని గైట్‌ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి.

Published : 05 Jan 2024 14:57 IST

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని గైట్‌ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి వెలిగించి సభలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడేందుకు, పిల్లలతో మాట్లాడించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ రాంమాధవ్‌ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదని.. దానికి 2,500 ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెప్పారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ తెలుగు పండగ ఈనెల 7వ తేదీ వరకు జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని