IRCTC: ‘వర్క్ ఫ్రమ్ హోటల్ ఇన్ కేరళ’ ప్యాకేజీ!
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వసతులు
తిరువనంతపురం: కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వసతులు ఉంటాయో, లేదో అని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్(ఐఆర్సీటీసీ) ప్రత్యేకంగా ఓ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
దైవభూమి.. పచ్చని ప్రకృతికి నెలవైన కేరళలోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి పని చేసుకునేలా ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో ఈ ప్యాకేజీని మే నెలలోనే ప్రారంభించింది. కరోనా, లాక్డౌన్తో నష్టపోయిన పర్యాటక రంగానికి, కేరళ రాష్ట్రానికి, అలాగే కరోనా పరిస్థితుల్లో అనేక ఒత్తిళ్లకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ ప్యాకేజీ ధర రూ.10,126 నుంచి (ట్రిపుల్ ఆక్యూపెన్సీ) ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు సాగే ఈ ప్యాకేజీలో భాగంగా హోటల్లో పూర్తిగా శానిటైజ్ చేసిన గది, మూడు పూటల భోజనం, రోజులో రెండు సార్లు కాఫీ/టీ అందిస్తారు. వర్క్ ఫ్రమ్ హోటల్ కాబట్టి.. ఉచితంగా వైఫై, వాహనాలు నిలుపుకొనేందుకు పార్కింగ్ స్థలం, ట్రావెల్ ఇన్సూరెన్స్ లభిస్తాయి.
మున్నార్, కుమరకొమ్, మరారి(అలప్పీ), కోవలమ్, వయనాడ్, కొచ్చి తదితర ప్రాంతాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ ప్యాకేజీ అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లోని హోటల్ గదుల్లో బస చేస్తూ పనితోపాటు.. కొత్త ప్రాంతపు అందాలను ఆస్వాదించొచ్చు. అయితే, కొవిడ్ దృష్ట్యా సందర్శక ప్రాంతాలను ప్యాకేజీలో భాగం చేయకపోవడం గమనార్హం. ఐదు రాత్రులు ప్యాకేజీలో కనిష్ఠ పరిమితి మరికొన్ని రోజులు అయినా అదనపు చెల్లింపులతో పొడిగించుకునే అవకాశం కల్పిస్తోంది. ప్యాకేజీలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్