JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స

మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

Published : 15 May 2024 15:44 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దాని ప్రభావంతో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా  జేసీ ప్రభాకర్‌రెడ్డి సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి తెలిపారు. ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య నిర్ధరణ పరీక్షలు పూర్తయిన తర్వాత బులెటిన్‌ విడుదల చేస్తామని వైద్యులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు