AP High Court: ‘నాట్‌ బిఫోర్‌ మీ’.. రఘురామ పిల్‌పై విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 08 Nov 2023 11:57 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్‌, ఆయన బంధుగణం, వివిధ కంపెనీలకు రూ.కోట్లలో అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామ పిల్‌ వేశారు. దీనిపై ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ విచారణ నుంచి జస్టిస్‌ రఘునందనరావు తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో వేరే బెంచ్‌ వద్ద పిల్‌ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని సీజే బెంచ్‌ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని