Viveka Murder Case: అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రిజర్వ్
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దస్తగిరిని, అతని కుటుంబాన్ని అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్లు గతేడాది డిసెంబర్లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడ్డారని వివరించింది. ‘‘అవినాష్ రెడ్డి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి. కేసును ప్రభావితం చేస్తున్నారు. బెయిల్పై బయట ఉండే అర్హత ఆయనకు లేదు. అందుకే, వెంటనే బెయిల్ రద్దు చేయాలి’’అని సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
మరోవైపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్.. దస్తగిరి తరఫున కోర్టులో వాదించారు. ‘‘2023 మేలో అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 11 నెలల తర్వాత బెయిల్ రద్దు చేయమని మేం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. ఒకవేళ రాజకీయ ప్రొద్బలం ఉంటే వెంటనే హైకోర్టును సంప్రదించే వాళ్లం. దస్తగిరి, ఆయన భార్య, తండ్రిపై దాడికి దిగారు. మెడికల్ క్యాంపు పేరుతో చైతన్యరెడ్డి జైలుకి వెళ్లి దస్తగిరికి రూ.20 కోట్లు ఇస్తామని మభ్యపెట్టారు. జైలు అధికారులు, పోలీసులతో కుమ్మక్కై సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు’’అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!