Viveka Murder Case: అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రిజర్వ్
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దస్తగిరిని, అతని కుటుంబాన్ని అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్లు గతేడాది డిసెంబర్లో ఆయన భార్య ఫిర్యాదు చేసిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, ఇప్పటికే దర్యాప్తును ప్రభావితం చేసేలా పలు చర్యలకు పాల్పడ్డారని వివరించింది. ‘‘అవినాష్ రెడ్డి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి. కేసును ప్రభావితం చేస్తున్నారు. బెయిల్పై బయట ఉండే అర్హత ఆయనకు లేదు. అందుకే, వెంటనే బెయిల్ రద్దు చేయాలి’’అని సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
మరోవైపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్.. దస్తగిరి తరఫున కోర్టులో వాదించారు. ‘‘2023 మేలో అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 11 నెలల తర్వాత బెయిల్ రద్దు చేయమని మేం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. ఒకవేళ రాజకీయ ప్రొద్బలం ఉంటే వెంటనే హైకోర్టును సంప్రదించే వాళ్లం. దస్తగిరి, ఆయన భార్య, తండ్రిపై దాడికి దిగారు. మెడికల్ క్యాంపు పేరుతో చైతన్యరెడ్డి జైలుకి వెళ్లి దస్తగిరికి రూ.20 కోట్లు ఇస్తామని మభ్యపెట్టారు. జైలు అధికారులు, పోలీసులతో కుమ్మక్కై సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు’’అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల