MLC Kavita: కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వు
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి.
దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కవిత తరఫున మధ్యంతర బెయిల్ పిటిషన్పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.
అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు: ఈడీ
బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. దిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారు. ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారు. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పది ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్ చేశారు. నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారు. అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు. ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదు. సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ అడిగారు. కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి’’ అని ఈడీ తెలిపింది. వాదనల అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM