సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.

Published : 27 May 2024 13:56 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీశ్‌ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని