Warangal: నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ను ఉప్పల్ స్టేషన్లో సాయంత్రం 6.10గంటలకు నిలిపివేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తోన్న నవజీన్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. నవజీవన్ ఎక్స్ప్రెస్ రైల్లో ఇంజిన్లో సాంకేతికలోపం కారణంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ను నవజీవన్ ఎక్స్ప్రెస్కు మార్చిన అనంతరం రాత్రి 8గంటలు దాటిన తర్వాత రెండు రైళ్లు బయల్దేరాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు స్టేషన్ మాస్టర్తో వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటలకు పైగా రైళ్లు నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం