SImhachalam: అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయమానంగా జరిగింది.
సింహగిరిపై వైభవోపేతంగా రథోత్సవం
అశేషంగా తరలివచ్చిన భక్తజనం
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం శోభాయమానంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐ.వి.రమణాచార్యులు, అలంకారి పురోహితులు కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చక పరివారం వైదిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు. మధ్యాహ్నం ఆలయంలో కొట్నాల ఉత్సవం జరిగింది. ముత్తైదువలు రోటిలో పసుపు కొమ్ములు దంచి పసుపు చూర్ణం తయారు చేశారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో అర్చకులు గ్రామ బలిహరణం జరిపించారు. ముక్కోటి దేవతలను స్వామి కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. తర్వాత అమ్మవార్లను ముత్యాల పల్లకీలో, స్వామిని బంగారు తొళక్కియాన్లో అధిష్ఠింపజేసి మాడవీధుల్లో చెరోవైపున తిరువీధి నిర్వహించారు. పశ్చిమ మాడవీధిలోని జోడుభద్రాల వద్ద స్వామి, అమ్మవార్లను ఎదురెదురుగా ఆశీనులను చేసి ఎదురు సన్నాహ ఉత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల తరఫున పండితులు సంవాద సేవ నిర్వహించి స్వామి వారి గొప్పతనాన్ని అమ్మవార్లకు తెలియజేసి పరిణయానికి ఒప్పించే ఘట్టాన్ని రమణీయంగా నిర్వహించారు.
అంగరంగ వైభవంగా రథోత్సవం: ఎదురు సన్నాహోత్సవం అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి రాజగోపురం ఎదురుగా రథంలో కొలువుదీర్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. అమ్మవారి తరఫున జాలరి కుల పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథ్యం వహించారు. రథంలో కొలువైన గోవిందరాజ స్వామి, అమ్మవార్ల శోభాయాత్రను దర్శించుకున్న అశేష భక్తజనం గోవింద నామస్మరణ చేశారు.
కనులపండువగా పరిణయ వేడుక: రథోత్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని బంగారు తొళక్కియాన్లో అధిష్ఠింపజేసి ఊరేగింపుగా నృసింహ మండపం ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్ఠింప జేశారు. అర్చకులు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ దేవతామూర్తుల శిరస్సున జీలకర్ర, బెల్లం ఉంచి సుముహూర్తాన నాదస్వర మంగళవాయిద్యాలతో మాంగల్యధారణ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించారు. మంచి ముత్యాలను స్వామి, అమ్మవార్ల శిరస్సున వేసి తలంబ్రాల తంతు వేడుకగా జరిపించారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించారు. అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సింహగిరిపై విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. మహిళల కోలాటం, జానపద కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. విశాఖ శ్రీశారదా పీఠం స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర, సీపీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు