MLC Kavitha: కవిత ఈడీ కస్టడీ మూడు రోజుల పొడిగింపు..
వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
దిల్లీ: వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఆమెను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత కుటుంబసభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
కోర్టులోకి వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. తన అరెస్టు అక్రమమని.. న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ను కవిత తరఫు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినీనటుడు అల్లు అర్జున్పై కేసు నమోదు
సినీనటుడు అల్లు అర్జున్పై నంద్యాలలో కేసు నమోదైంది. -
ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్
ఎల్బీనగర్లో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
నగరంలోని ఆంధ్రా ఓటర్లు కదిలారు. తమ అభిమాన నేతలను గెలిపించుకుని ఆంద్రప్రదేశ్ తలరాతను మార్చేందుకు సిద్ధమయ్యారు. -
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
కడపలోని షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) రిజర్వేషన్ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. -
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అట్టుడికిపోయిందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. -
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో మినీ వ్యాను బోల్తా పడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.