AP SI Exam: ఎస్సై రాత పరీక్షపై కీలక అప్డేట్.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఎస్సై ఉద్యోగాల(Ap SI posts) భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష ప్రిలిమినరీ కీ సోమవారం, ఫలితాలు మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 411 ఎస్ఐ ఉద్యోగాల (SI posts) భర్తీకి ఏపీ పోలీసు నియామక బోర్డు(apslprb) ఈరోజు (ఫిబ్రవరి 19న) రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,243మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 పట్టణాలు/నగరాల్లోని 291 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు తెలిపారు.
ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని సోమవారం ఉదయం 11గంటలకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 ఉదయం 11గంటల లోపు SCTSI-PWT@slprb.appolice.gov.inలో తెలియజేయాలని సూచించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ కాపీలతో పాటు ఫలితాలను రెండు వారాల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్ష సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ మనీశ్ కుమార్ సిన్హా ఓ ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!