‘కరోనా వైరస్తో ప్రేమలో పడ్డ శాస్త్రవేత్త’
గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల అన్ని రంగాలు చతికిలపడ్డాయి. ఇప్పటికీ సినిమా రంగం కోలుకోలేకపోతుంది. అయితే, కొంతమంది మాత్రం కరోనావైరస్ను సైతం కంటెంట్గా మార్చి సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రామ్గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ పేరుతో ఓ సినిమాను
వైరల్ అవుతోన్న ‘కిస్సింగ్ ది కరోనా వైరస్’ నవల
(ఫొటో: అమెజాన్.ఇన్)
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల అన్ని రంగాలు చతికిలపడ్డాయి. ఇప్పటికీ సినిమా రంగం కోలుకోలేకపోతుంది. అయితే, కొంతమంది మాత్రం కరోనావైరస్ను సైతం కంటెంట్గా మార్చి సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రామ్గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. మరికొందరు తీయబోతున్నట్లు ప్రకటించారు. సినిమాలే కాదు.. కరోనాపై నవలలు కూడా వచ్చాయి. కొన్ని నెలల కిందట కరోనా వైరస్పై ఓ నవల మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు ప్రజలు పట్టించుకోలేదు గానీ, తాజాగా ఆ నవల సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
‘కిస్సింగ్ ది కరోనా వైరస్’ అనే నవలను ఎం.జె ఎడ్వర్డ్స్ అనే మహిళ రాశారు. ఇదే ఆమె తొలి నవల. 16 పేజీలుండే ఈ నవలలో డాక్టర్ అలెక్సా అషింగ్టన్ఫొర్డ్ అనే వైద్యశాస్త్రవేత్త కరోనా వైరస్కు టీకాను కనిపెట్టే పనిలో నిమగ్నమవుతుంది. తయారు చేసిన వ్యాక్సిన్ను ట్రయల్స్లో భాగంగా తన తోటి శాస్త్రవేత్తపై ప్రయోగిస్తుంది. అయితే, ఆ టీకా వికటించి ఆ శాస్త్రవేత్త మరణిస్తాడు. అతడి శరీరాన్ని కరోనా వైరస్ ఆక్రమించి మానవుడిలా మారిపోతుంది. ఆ తర్వాత మానవ రూపంలో ఉన్న ఆ వైరస్తో డాక్టర్ అలెక్సా ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని నవల చదివి తెలుసుకోవాల్సిందే. ఈ పుసక్తంపై డాక్టర్ అలెక్సా.. కరోనావైరస్ సన్నిహితంగా ఉన్న చిత్రం ఉంటుంది. రచయిత ఎం.జె ఎడ్వర్డ్స్ కరోనా కారణంగా తన ఉద్యోగం పోవడంతో అప్పులు చెల్లించడం కోసం ఈ ‘కిస్సింగ్ ది కరోనా వైరస్’ నవల రాశారట. ఫిక్షనల్-రొమాంటిక్ జోనర్లో రాసిన ఈ నవల ఏప్రిల్లోనే అమెజాన్కు చెందిన కిండిల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.76. అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తాజాగా ఆ నవల సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లలో కొందరు ఈ నవల చాలా ఫన్నీగా ఉందని, బాగుందని అంటుంటే.. మరికొందరు వైద్యశాస్త్రాన్ని ఎగతాళి చేస్తూ రాస్తారా, చదివితే టైం వేస్ట్ అని మండిపడుతున్నారు. అమెజాన్ ఆన్లైన్ స్టోర్లో ఈ నవలకు రేటింగ్ 4స్టార్స్(5స్టార్స్లో)రావడం విశేషం.
ఇదే తరహాలో కరోనాపై మరో నవల కూడా మార్కెట్లోకి వచ్చింది. నవల పేరు ‘కోర్టింగ్ ది కరోనా వైరస్’. జాన్ అనే మహిళ కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టే ల్యాబ్లో పనిచేస్తుంటుంది. అనుకోకుండా ఆ వైరస్ను 19వ శతాబ్దంలోకి పంపిస్తుంది. దీనికి ఆ మహిళే బాధ్యత వహించి గతంలోకి వెళ్లి కరోనా వైరస్ను వెనక్కి తీసుకొస్తుంది. ఎలా అనేది తెలుసుకోవాలంటే నవల చదవాలి. ఇదీ కూడా అమెజాన్లోనే లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి