MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్‌రావు

దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను భర్త అనిల్‌తో పాటు భారాస ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు కలిశారు.

Published : 17 Mar 2024 19:36 IST

దిల్లీ: దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను భర్త అనిల్‌తో పాటు భారాస ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు కలిశారు. ఆమె అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం. దిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్‌ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని