Hyderabad: మాటిచ్చి పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన కేటీఆర్‌

మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్‌ మిలీనియం పాఠశాల విద్యార్థులకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఇచ్చిన మాటను కేటీఆర్‌ నిలబెట్టుకున్నారు.

Updated : 03 Mar 2024 18:09 IST

హైదరాబాద్‌: మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్‌ మిలీనియం పాఠశాల విద్యార్థులకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఇచ్చిన మాటను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నిలబెట్టుకున్నారు. పాఠశాల వార్షిక దినోత్సవానికి రావాలని విద్యార్థులు ఎక్స్‌ వేదికగా కోరగా.. ఆయన వస్తానని మాటిచ్చి వెళ్లారు. తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. సెల్ఫీలు తీసుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ తమ విద్యార్థుల కోరికను మన్నించి కార్యక్రమానికి హాజరు కావడం పట్ల పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని