Tirumala: తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి.

Updated : 30 Dec 2023 10:17 IST

తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత, ఎలుగు బంటి సంచారం కలకలం రేపింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ప్రాంతంలోనే.. ఈ నెల 13, 26 తేదీల్లో వీటి సంచారం కనిపించినట్లు అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో నడకమార్గంలో వచ్చే భక్తులను తితిదే హెచ్చరించింది. అప్రమత్తంగా, గుంపులు గుంపులుగా భక్తులు రావాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని