Pinnelli: ఈవీఎం విధ్వంసం కేసు.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి?
ఈవీఎంను ధ్వంసం చేసి, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్: ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్హౌస్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇస్నాపూర్ లోకేషన్ గురించి మాచర్ల పోలీసులు.. పటాన్చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగినట్టు సమచారం. పిన్నెల్లి అరెస్టుపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా
పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు (పోలింగ్ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేశారు. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. -
‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన తెదేపా ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
నా పెళ్లికి ఉద్యోగంతో లింక్.. జాబ్ ఇవ్వండి ప్లీజ్!
Viral news: ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుల్లో జాబ్ రోల్ గురించి పేర్కొంటారు. అలా జాబ్ రోల్లో ఓ వ్యక్తి తన పెళ్లి గురించి ప్రస్తావించడం వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
-
విఘ్నేశ్తో గొడవపై స్పందించిన విజయ్ సేతుపతి.. ఏమన్నారంటే
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
-
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు