టార్గెట్ 2153: 180 ఏళ్లు బతకాలని..!
ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుషు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన డేవ్ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుష్షు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన 48 ఏళ్ల డేవ్ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా 180ఏళ్లు బతకాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో క్రైయోథెరపీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి పద్ధతులను పాటిస్తున్నాడు. తన జీవగడియారాన్ని వెనక్కి తిప్పి తన శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగుపర్చుకుంటున్నాడు. దీన్నే ‘బయోహ్యాకింగ్’ అంటారని, దీని ద్వారా తాను కచ్చితంగా 2153 వరకు జీవించి ఉంటానని డేవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఎముక మజ్జను తొలగించి..
ఎక్కువ కాలం జీవించి ఉండటం కోసం డేవ్ వైద్యపరంగా యాంటి ఏజింగ్ చికిత్సలు తీసుకోవడంతోపాటు.. తన అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు. మితంగా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చేస్తున్నాడు. ఆహారం, నిద్రపై పూర్తి నియంత్రణ సాధించాడు. ఇటీవల తన ఎముక మజ్జను తొలగించి.. తన మూల కణాలను తిరిగి శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ‘బాల్యంలో శరీరంలో మూలకణాలు సమృద్ధిగా ఉంటాయి. అదే వయసు పెరిగేకొద్ది మూలకణాలు నశిస్తుంటాయి. అందుకే వీటిని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం ద్వారా ఆరోగ్యంగా.. నిత్యయవ్వనంగా ఉండొచ్చు’ అని డేవ్ వెల్లడించాడు. ఈ వైద్య చికిత్సల కోసం ఇప్పటి వరకు డేవ్ 10లక్షల డాలర్లు (దాదాపు రూ.7.28కోట్లు) వెచ్చించాడట.
ఈ పద్ధతులు పాటిస్తే..
క్రైయోథెరపీ లేదా కోల్డ్ థెరఫీలో అత్యల్ప ఉష్ణోగ్రతను ఉపయోగించి కణజాలాలకు అయ్యే గాయాల్ని తగ్గించొచ్చని డేవ్ అంటున్నాడు. అందుకే గత పదేళ్లుగా డేవ్ చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తున్నాడట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను కూడా క్రమం తప్పకుండా పాటిస్తున్నాడు. అంటే కనీసం 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. ఆ తర్వాత ఆహారం తీసుకొని మరో 16 గంటలు ఏమీ తనకూడదు. ఈ ఫాస్టింగ్లో షెడ్యూల్స్ రకరకాలుగా ఉంటాయి. తినకుండా ఉండే సమయంలో శరీరంలో ఏవైనా లోపాలు, సమస్యలు ఉంటే శరీరం తనంతట తానే నయం చేసుకుంటుందని డేవ్ పేర్కొన్నాడు. తాను పాటిస్తున్న పద్ధతులను 40 ఏళ్లలోపు వారు పాటిస్తే.. వందేళ్లు వచ్చే వరకు సంతోషంగా, యాక్టివ్గా బతకగలరని తెలిపాడు. త్వరలో ఈ పద్ధతులన్నీ బాగా ప్రాచూర్యం పొందుతాయంటున్నాడు. మరి వీటిలో ఎంత వరకు నిజముందో వైద్యులే బయటపెట్టాలి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు