టార్గెట్ 2153: 180 ఏళ్లు బతకాలని..!
ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుషు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన డేవ్ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుష్షు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన 48 ఏళ్ల డేవ్ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా 180ఏళ్లు బతకాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో క్రైయోథెరపీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి పద్ధతులను పాటిస్తున్నాడు. తన జీవగడియారాన్ని వెనక్కి తిప్పి తన శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగుపర్చుకుంటున్నాడు. దీన్నే ‘బయోహ్యాకింగ్’ అంటారని, దీని ద్వారా తాను కచ్చితంగా 2153 వరకు జీవించి ఉంటానని డేవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఎముక మజ్జను తొలగించి..
ఎక్కువ కాలం జీవించి ఉండటం కోసం డేవ్ వైద్యపరంగా యాంటి ఏజింగ్ చికిత్సలు తీసుకోవడంతోపాటు.. తన అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు. మితంగా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చేస్తున్నాడు. ఆహారం, నిద్రపై పూర్తి నియంత్రణ సాధించాడు. ఇటీవల తన ఎముక మజ్జను తొలగించి.. తన మూల కణాలను తిరిగి శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ‘బాల్యంలో శరీరంలో మూలకణాలు సమృద్ధిగా ఉంటాయి. అదే వయసు పెరిగేకొద్ది మూలకణాలు నశిస్తుంటాయి. అందుకే వీటిని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం ద్వారా ఆరోగ్యంగా.. నిత్యయవ్వనంగా ఉండొచ్చు’ అని డేవ్ వెల్లడించాడు. ఈ వైద్య చికిత్సల కోసం ఇప్పటి వరకు డేవ్ 10లక్షల డాలర్లు (దాదాపు రూ.7.28కోట్లు) వెచ్చించాడట.
ఈ పద్ధతులు పాటిస్తే..
క్రైయోథెరపీ లేదా కోల్డ్ థెరఫీలో అత్యల్ప ఉష్ణోగ్రతను ఉపయోగించి కణజాలాలకు అయ్యే గాయాల్ని తగ్గించొచ్చని డేవ్ అంటున్నాడు. అందుకే గత పదేళ్లుగా డేవ్ చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తున్నాడట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను కూడా క్రమం తప్పకుండా పాటిస్తున్నాడు. అంటే కనీసం 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. ఆ తర్వాత ఆహారం తీసుకొని మరో 16 గంటలు ఏమీ తనకూడదు. ఈ ఫాస్టింగ్లో షెడ్యూల్స్ రకరకాలుగా ఉంటాయి. తినకుండా ఉండే సమయంలో శరీరంలో ఏవైనా లోపాలు, సమస్యలు ఉంటే శరీరం తనంతట తానే నయం చేసుకుంటుందని డేవ్ పేర్కొన్నాడు. తాను పాటిస్తున్న పద్ధతులను 40 ఏళ్లలోపు వారు పాటిస్తే.. వందేళ్లు వచ్చే వరకు సంతోషంగా, యాక్టివ్గా బతకగలరని తెలిపాడు. త్వరలో ఈ పద్ధతులన్నీ బాగా ప్రాచూర్యం పొందుతాయంటున్నాడు. మరి వీటిలో ఎంత వరకు నిజముందో వైద్యులే బయటపెట్టాలి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్