Viral news: ఆఫీసుకు ఆలస్యమైతే చెప్పడానికి కొత్త సాకు దొరికిందోచ్..!
ఆఫీసుకు ఆలస్యం అయిన సందర్భంలో బాస్కు చెప్పేందుకు కొత్త సాకు దొరికిందంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏంటా సాకో చూసేయండి..
Viral news | ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసుకు ఆలస్యమైనప్పుడు బాస్కు సాకులు చెప్పడం ఉద్యోగులకు అలవాటే. బస్ మిస్సయ్యాననో.. హాస్పిటల్కు వెళ్లొచ్చేసరికి లేట్ అయ్యిందనో ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. కారణం కూడా సహేతుకంగా అనిపిస్తే సరే సరి. లేదంటే బాస్ చేతిలో తిట్లు తప్పవు. అలాగని ఆలస్యమైన ప్రతిసారీ రొటీన్గా ఇవే సాకులు చెప్పడమూ బోరే. అలాంటి వారికి కొత్త సాకు దొరికిందంటున్నారు నెటిజన్లు.
ప్రతీక్ రాయ్ అనే సోషల్మీడియా యూజర్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తన ఏథర్ స్కూటర్ సాఫ్ట్వేర్ అప్డేట్ మూలంగా తాను ఆలస్యంగా ఆఫీస్కు వెళ్లానని పేర్కొంటూ సరదాగా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. కొన్ని గంటల్లోనే దాదాపు 5 లక్షల వ్యూస్ సాధించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.
‘ఆఫీసుకు లేట్ అయినప్పుడు బాస్కు చెప్పేందుకు కొత్త సాకు దొరికిందోచ్’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ‘ఇంకా నయం.. రోడ్డు మధ్యలో ఆగి పోలేదు. అదృష్టవంతుడివి భయ్యా!’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘ఒకవేళ బాస్ టెక్ సావీ కాకపోతే దీన్ని వివరించడం ఇంకో అతిపెద్ద సమస్య’ అంటూ పేర్కొన్నాడు. ‘విండోస్ అప్డేట్ మూలంగా మీటింగ్కు జాయిన్ అవ్వలేకపోయా..! స్కూటర్ అప్డేట్ కారణంగా ఆఫీసుకు రాలేకపోయా!!’’ అంటూ మరో యూజర్ ఫన్నీగా పోస్ట్ పెట్టారు. ‘ఎందుకొచ్చిన చిక్కులు బ్రో.. హాయిగా పెట్రోల్ స్కూటర్ కొనుక్కో’ అంటూ మరో యూజర్ సలహా ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం