Viral news: ఆఫీసుకు ఆలస్యమైతే చెప్పడానికి కొత్త సాకు దొరికిందోచ్..!
ఆఫీసుకు ఆలస్యం అయిన సందర్భంలో బాస్కు చెప్పేందుకు కొత్త సాకు దొరికిందంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏంటా సాకో చూసేయండి..
Viral news | ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసుకు ఆలస్యమైనప్పుడు బాస్కు సాకులు చెప్పడం ఉద్యోగులకు అలవాటే. బస్ మిస్సయ్యాననో.. హాస్పిటల్కు వెళ్లొచ్చేసరికి లేట్ అయ్యిందనో ఏవేవో కారణాలు చెప్తూ ఉంటారు. కారణం కూడా సహేతుకంగా అనిపిస్తే సరే సరి. లేదంటే బాస్ చేతిలో తిట్లు తప్పవు. అలాగని ఆలస్యమైన ప్రతిసారీ రొటీన్గా ఇవే సాకులు చెప్పడమూ బోరే. అలాంటి వారికి కొత్త సాకు దొరికిందంటున్నారు నెటిజన్లు.
ప్రతీక్ రాయ్ అనే సోషల్మీడియా యూజర్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తన ఏథర్ స్కూటర్ సాఫ్ట్వేర్ అప్డేట్ మూలంగా తాను ఆలస్యంగా ఆఫీస్కు వెళ్లానని పేర్కొంటూ సరదాగా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. కొన్ని గంటల్లోనే దాదాపు 5 లక్షల వ్యూస్ సాధించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.
‘ఆఫీసుకు లేట్ అయినప్పుడు బాస్కు చెప్పేందుకు కొత్త సాకు దొరికిందోచ్’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ‘ఇంకా నయం.. రోడ్డు మధ్యలో ఆగి పోలేదు. అదృష్టవంతుడివి భయ్యా!’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘ఒకవేళ బాస్ టెక్ సావీ కాకపోతే దీన్ని వివరించడం ఇంకో అతిపెద్ద సమస్య’ అంటూ పేర్కొన్నాడు. ‘విండోస్ అప్డేట్ మూలంగా మీటింగ్కు జాయిన్ అవ్వలేకపోయా..! స్కూటర్ అప్డేట్ కారణంగా ఆఫీసుకు రాలేకపోయా!!’’ అంటూ మరో యూజర్ ఫన్నీగా పోస్ట్ పెట్టారు. ‘ఎందుకొచ్చిన చిక్కులు బ్రో.. హాయిగా పెట్రోల్ స్కూటర్ కొనుక్కో’ అంటూ మరో యూజర్ సలహా ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్