Chiranjeevi - Pawan Kalyan: జనసేనకు చిరంజీవి భారీ విరాళం

జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ నటుడు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు.

Updated : 08 Apr 2024 19:12 IST

హైదరాబాద్‌: జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ నటుడు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌ నగర శివారులోని ముచ్చింతల్‌లో ‘విశ్వంభర’ షూటింగ్‌ లొకేషన్‌లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరూ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ముగ్గురూ మాట్లాడుకున్నారు. నీ వెనక నేనున్నానంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు.

‘‘అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా, తన సంపదని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్. అతని లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను’’అని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని