Botsa Satyanarayana: ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోం: మంత్రి బొత్స
రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలకు వివరించామన్నారు. 82 వేలకు పైగా ఉపాధ్యాయులు బదిలీలు కోరారని చెప్పారు.
‘‘రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. 350 మంది ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా పదోన్నతి కల్పిస్తాం. ప్రస్తుతం 355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో రాత్రి వాచ్మెన్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశాం. 175 ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తాం. 98 మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. సబ్జెక్టు టీచర్లు లేనిచోట విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించాలి. పది, ఇంటర్లో ప్రతిభ కనబరిచినవారికి అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తాం. 20వ తేదీన (మంగళవారం) సీఎం చేతుల మీదుగా విజయవాడలో అభినందన కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని బొత్స వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365