KTR: పాపికొండలు, కోనసీమను తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు.
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. రూ.3.16 కోట్లతో మధ్యమానేరు జలాశయంలో విహారానికి ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బోటును నడిపి సందడి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
టాటాలు, బిర్లాలే కాదు.. తాతల నాటి కులవృత్తులూ బతకాలి
‘‘ఇంతకుముందు సిరిసిల్లకు వస్తే చుక్కనీరు కనిపించక పోయేది. నేడు పాపికొండలు, కోనసీమను తలదన్నే విధంగా సిరిసిల్ల అభివృద్ధి చెందింది. మధ్యమానేరులో మత్స్య సంపదను పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మా ప్రాంతాన్ని మెచ్చుకొంటుంటే నా గుండె సంతోషంతో నిండిపోతుంది. టాటాలు, బిర్లాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం. సిరిసిల్లతో పాటు జిల్లా మండల కేంద్రాల్లోనూ నీరా కేఫ్లు ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్ను కోరుతున్నా. గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి గాయాలపాలు కాకుండా సేఫ్టీ మోకులు అందజేస్తాం’’ అని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి పాలనలో నేతన్నలు, గౌడ వృత్తిదారులు ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదు. వారికి ఎన్నో వేధింపులు ఉండేవి.. ఇప్పుడు అలాంటివి లేవు. వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. నీరా కేఫ్లు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మరిన్ని ఉపాధి సదుపాయాలు కల్పిస్తున్నాం. సేఫ్టీ మోకుల తయారీ, పరీక్షల అనంతరం వాటిని కచ్చితంగా గీతన్నలకు పంపిణీ చేస్తాం’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు