TS News: గీత చెట్లు నరికితే మూడేళ్లు జైలుకే: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలో తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లను నరికి వేసే వారిపై కనీసం మూడేళ్లు కఠిన కారాగార శిక్ష , జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లను నరికి వేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, కనీసం మూడేళ్లు జైలు శిక్ష, జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీ లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరు (సంఖ్య) ఇవ్వాలని సూచించారు. కొత్త కల్లు దుకాణాలను మంజూరు చేసి టీసీఎస్, టీఎఫ్టీ కింద వారికి లైసెన్సులను మంజూరు చేయాలన్నారు. టీఎఫ్టీ లైసెన్సులను మెజారిటీ సభ్యుల అంగీకారంతో టీసీఎస్లుగా మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. కల్లు దుకాణాల తరలింపు, రద్దు చేయబడిన కల్లు దుకాణాల పునరుద్ధరణ క్షేత్ర స్థాయిలో డీసీ స్థాయి అధికారి చూసేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాటి చెట్టు ఎక్కే ఆధునిక సేఫ్టీ యంత్రాలను గీత కార్మికులకు అందించాలని స్పష్టం చేశారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత, ఖర్జూర, గిరక తాటి చెట్లను పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గజ్జెల నగేష్, రాష్ట్ర ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మమ్మద్ ముషారఫ్ ఫారూకి, అదనపు కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్లు చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, అనీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM