Thummala: మిర్చి మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

గిట్టుబాటు ధరలకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Updated : 12 Jan 2024 13:36 IST

ఖమ్మం: గిట్టుబాటు ధరలకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ధరను గణనీయంగా తగ్గిస్తున్నారంటూ రైతులు మంత్రి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం మార్కెట్‌లో అవకతవకలపై సమీక్షించిన మంత్రి.. పర్యవేక్షణ కరవైందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, వ్యాపారులతో వివిధ అంశాలపై చర్చించారు. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని.. అన్నదాతలకు వెంటనే చెల్లింపులు జరపాలని సూచించారు. రైతులు మోసపోకుండా ఇతర శాఖలను సమన్వయం చేసుకుని వారికి న్యాయం చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని