MLC Kavita: దిల్లీ బయల్దేరిన కవిత.. ఈడీ విచారణపై ఉత్కంఠ
ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దిల్లీ బయల్దేరారు. ఇప్పటికే షెడ్యూల్ కార్యక్రమాలు చాలా ఉన్నందున.. ఆమె రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
హైదరాబాద్: దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) దిల్లీ బయల్దేరారు. ఇప్పటికే షెడ్యూల్ కార్యక్రమాలు చాలా ఉన్నందున.. ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. శుక్రవారం దిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం ఆమె దీక్ష చేయనున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలు, మహిళా సంఘాలను ఆహ్వానించారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం రేపు, ఎల్లుండి ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని ఉదయమే కవిత ప్రకటన జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఈడీని కూడా గడువు కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కవిత దిల్లీ బయల్దేరారు. గురువారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, దీనిపై ఏం చేయాలనే దానిపై భారాస నేతలతో పాటు, న్యాయనిపుణులతో ఆమె చర్చించారు. అనంతరం కవిత దిల్లీ పయనమయ్యారు. అయితే, గురువారం ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యే అవకాశం లేదని భారాస వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం మాత్రం కచ్చితంగా ధర్నా నిర్వహిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. భారత జాగృతి చేపట్టిన ధర్నా ఏర్పాట్ల కోసమే కవిత దిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సౌత్ గ్రూప్లో కవిత కీలకపాత్ర పోషించారని, ఆమె తరఫున అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీగా వ్యవహరించినట్టు ఈడీ రిమాండ్ రిపోర్టులో పలుమార్లు ప్రస్తావించింది. ఈక్రమంలో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు పిళ్లై కస్టడీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో గురువారం దిల్లీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే