MLC Kavitha: కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ ఈ ఉదయం హాజరుపరిచింది.

Updated : 16 Mar 2024 12:02 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ ఈ ఉదయం హాజరుపరిచింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. న్యాయపోరాటం చేస్తానని కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో అన్నారు. ఆమె తరఫున సీనియర్‌ లాయర్‌ విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపిస్తుండగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోసెబ్‌ హుస్సేన్‌ వాదనలు కొనసాగిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. రాత్రి దిల్లీలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచారు. శనివారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని