Expensive Dishes: వామ్మో! ఈ ఆహార పదార్థాలు మరీ ఇంత ఖరీదా..?
పుట్టిన రోజో, పండగ రోజో స్నేహితులతో కలిసి రెస్టారెంట్కెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంటుంది... బిల్లు కట్టినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఏడాదికోసారేగా.. ఆ మాత్రం ఖర్చు చేయలేమా?
ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన రోజో, పండగ రోజో స్నేహితులతో కలిసి రెస్టారెంట్కెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంటుంది... బిల్లు కట్టినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఏడాదికోసారేగా.. ఆ మాత్రం ఖర్చు చేయలేమా? అనుకుంటే పర్వాలేదు. ఒకవేళ మీరు తరచూ ఇలాంటి పార్టీలు చేసుకునేవాళ్లే అయితే పొరపాటున కూడా ఇలాంటి ఈ ఆహార పదార్థాల జోలికి పోవద్దు. ఒకవేళ ఫ్రెండ్స్తో వెళ్లినా పర్సు నిండేంతగా డబ్బే కాకుండా, మీకున్న అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులను తీసుకుపోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే వాటి రేట్లు ఆ రేంజ్లో ఉంటాయ్ మరి! ఇంతకీ ఆ ఖరీదైన ఆహార పదార్థాలేమిటో.. ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు చూద్దాం.
సూరత్ స్పెషల్ ఘారి: గుజరాత్లో చండీ పడ్వా అనేది ఓ ముఖ్యమైన పండగ. శరద్ పూర్ణిమ తర్వాత రోజున ఈ పండగను జరుపుకుంటారు. ప్రధానంగా ఈ పండగకు గుజరాత్ ప్రజలు ‘ఘారి’ అనే స్వీట్ను తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఇదే స్వీట్ను సూరత్కు చెందిన ఓ మిఠాయి దుకాణదారుడు విభిన్నరీతిలో తయారుచేశాడు. బంగారం పూతతో ‘ఘారి’ని సిద్ధం చేశాడు. ఇంతకీ దీని ధర జస్ట్ కిలో రూ.9 వేలేనంట! సాధారణ ఘారీ మిఠాయి అయితే దుకాణం బట్టి రూ.600 నుంచి రూ.800 వరకు ఉంటుంది. బంగారం కదా మరి ఆమాత్రం ఉండొద్దా ఏం?
దిల్లీ స్పెషల్ కిళ్లీ: మిఠాయి కిళ్లీ అలా నోట్లో వేసుకుంటే అలా స్వర్గపు అంచుల వరకు వెళ్లొచ్చినట్లు ఉంటుంది. సాధారణంగా మన దగ్గర రూ.10 నుంచి రూ.50 వరకు ఉంటుంది. కానీ ఈ స్పెషల్ మిఠాయి పాన్ ధర కేవలం రూ.600 మాత్రమే. ఇది కావాలంటే అలా మన దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్ ప్లేస్ వరకు వెళ్లాల్సిందే. ఇక్కడి యమూస్ పంచాయత్ అనే పాన్ షాప్ యజమాని బంగారం పూత పూసిన పాన్ను తయారు చేస్తున్నారు. పూర్తిగా డ్రై ఫ్రూట్స్తో రూపొందించిన స్వీట్ పాన్పై గోల్డ్తో తయారు చేసిన పేపర్ను అతికించి ఇస్తారు. అందుకే దీనికి అంత ధరన్నమాట!
దోసేసి.. బంగారం పూతేసి: సాధారణంగా మనం హోటల్లో తినే దోసె ఓ ముప్పైయ్యో, నలభయ్యో ఉంటుంది. కాస్త వెరైటీ కవాలనుకుంటే మహాఅయితే ఓ వందో, రెండువందలో ఉంటుంది. అయితే ఇక్కడ కనిపించే దోసె ధర వింటే షాక్ అవ్వాల్సిందే. దీని ధర ఏకంగా రూ.1100. బెంగళూరులోని రాజ్బోగ్ అనే రెస్టారెంట్లో ఇది దొరుకుతుంది. సాధారణ దోసెపై 24 క్యారెట్ల బంగారు పూతను అతికించి ఇస్తారు. అంతేకాదు ఈ రెస్టారెంట్లో సుమారు 101 రకాల దోసెలు విక్రయిస్తుండడం గమనార్హం.
ఇది 24 క్యారెట్ల ఐస్క్రీమ్: ఇప్పుడు హాంకాంగ్ వెళ్దాం పదండి. ఇప్పుడు అక్కడికెందుకు అంటారా..? మరి ఈ 24 క్యారెట్ల ఐస్క్రీమ్ దొరికేది అక్కడే మరి! ఇదో కోన్ ఐస్క్రీమ్. అలాగని కోన్ మొత్తం ఏమీ బంగారం ఉండదు. కేవలం ఐస్క్రీమ్ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన ఓ పలుచని పేపర్ను ఉంచుతారు. మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర రూ.1000. బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి ఆ మధ్య ఎప్పుడో హాంకాంగ్ వెళ్లినప్పుడు ఈ ఐస్క్రీమ్ తిని ఇన్స్టాలో పంచుకుంది.
బిర్యానీ.. ₹20 వేలంట!: దుబాయ్ అంటే మనవాళ్లకు వెంటనే గుర్తొచ్చేది బంగారమే. ఈ ‘రాయల్ గోల్డెన్ బిర్యానీ’ కూడా లభించేది అక్కడే. అతి ఖరీదైన బిర్యానీగా పేరున్న ఈ బిర్యానీని ఇక్కడి బొంబాయి బరో అనే రెస్టారెంట్ తయారుచేస్తోంది. అన్నట్లు ఇది భారతీయుల రెస్టారెంటే. ఓ బంగారం పల్లెంలో బిర్యానీ వేసి దానిపై 23 క్యారెట్ల తినదగిన బంగారపు రేకులను అలంకరించి వడ్డిస్తారు. అందుకే దీని ధర రూ.20వేలు మరి. అంతేకాదు.. కీమా రైస్, వైట్రైస్, సాఫ్రాన్ రైస్ ఇలా మూడు రకాల రైస్లను వడ్డిస్తారు. దానిపై చిన్న చిన్న బంగాళా దుంపలు, ఉడికించిన కోడిగుడ్లు, వేయించిన జీడిపప్పుతో అలంకరిస్తారు. వింటుంటేనే నోరూరిపోతోంది కదూ!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న యువకుడు ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన చర్లపల్లి జైల్లో జరిగింది. -
భీమవరంలో అతిరాత్ర మహోత్కృష్ట సోమయాగం: గజల్ శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మే 15 నుంచి 25 వరకు మహోత్కృష్ట సోమయాగం నిర్వహించనున్నట్టు సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్ కోరారు. ‘రత్నం’ ప్రెస్మీట్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..