Nara Lokesh: బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్‌

వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు.

Updated : 22 Apr 2024 18:31 IST

అమరావతి: వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. ‘సొంత బాబాయిని హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే మాత్రం స్పందిస్తారా?’ అని అన్నారు. వైకాపా పాలనపై నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలున్నాయని సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. వైకాపా అసుర పాలనను అంతం చేయడానికి కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. బాధితురాలు పోస్టు చేసిన వీడియోను లోకేశ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాకు జోడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని