Renigunta Airport: విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

Updated : 20 May 2024 18:18 IST

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రేణిగుంట - గుల్బర్గా  స్టార్‌ అలియన్స్‌ విమాన సర్వీసును ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమానాశ్రయంలోనే మధ్యాహ్నం నుంచి వేచి ఉన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌లైన్స్‌ తీరును నిరసిస్తూ విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని