బ్యాంకులకు జమ కాని నిధులు.. ఏపీలో పింఛనుదారుల పడిగాపులు
ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు.
అమరావతి: ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారులు సరిగా సమాచారం ఇవ్వకపోవడం, వైకాపా నేతల దుష్ప్రచారంతో ఉదయమే అక్కడికి చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వారికి నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు.
ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా ఖాతాలో జమకాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఈ సాయంత్రానికైనా నిధులు వస్తాయో? లేదో? అనే పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారులు ఉద్దేశపూర్వకంగానే నగదు జమ ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులకు ఇంటికే వచ్చి పింఛను అందిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ అధికార పార్టీ నేతలు రాజకీయ లబ్ధికి యత్నించారు. రోగులు, వృద్ధులను మండుటెండలో మంచాలపై తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం